నెల్లూరు జిజిహెచ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో ఒక మహిళ చీర కొంగుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన జరిగింది.
నెల్లూరు కోవిడ్ ఆస్పత్రి జీజీహెచ్ ఐసోలేషన్ వార్డులో కరోనా రోగి మూలపేటకు చెందిన పరమేశ్వరమ్మ చీరకొంగుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
GGH రోగుల పర్యవేక్షణ చర్యలు చేపట్టడం లేదనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర కోవిడ్ హాస్పిటల్ లో గుర్తింపు పొందిన జీజీహెచ్ లో ఓ కరోనా బాధితురాలు ఉరివేసుకొని మరణించడం చూసేవారిని కన్నీటి పర్యంతం చేసింది.
జిజిహెచ్ లో ఎంతో మందిని పర్యవేక్షణ కోసం పెడుతున్నామని చెబుతున్న అధికారులు మాటలకు వాస్తవ రూపంకి చాలా తేడా ఉంది.
కరోనా బారినపడ్డ పరమేశ్వరమ్మకు వాంతులు తగ్గకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని అక్కడ డాక్టర్లు చెబుతున్నారు.