కరోనా రోగులకు దివ్య ఔషధంలా పని చేస్తున్న బొణిగె ఆనందయ్య ఆయుర్వేదం మందు పంపిణీ చేయకుండా ఎలా ఆపాలా అని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నతరుణంలో ఒక అద్భుతం ఆవిషృతం అయింది.
తెలంగాణ లోని పెద్ద పల్లి జిల్లా మంధని నుంచి చావుబతుకుల మధ్య కృష్ణపట్నం వచ్చిన ఒక యువకుడికి కంట్లో మందు వేసిన కొద్ది సేపటిలోనే లేచి మాట్లాడాడు.
గత 20 రోజులుగా కరోనాతో నానా ఇబ్బందులు పడుతున్న యువకుడు ఆనందయ్య ఆయుర్వేదం మందుతో నిమిషాల వ్యవధిలో కోలుకున్నాడు.
మాజీ మంత్రి సోమిరెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ బృందం కృష్ణపట్నంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
ఆనందయ్య మందును ఎవరూ అడ్డుకోవద్దని ఆ యువకుడు, అతడి తల్లి కూడా కోరుతున్నారు. (యువకుడు కోలుకున్న వీడియో ఇది)