విశాఖ పట్నంలోని కరోనా ఆసుపత్రిలో ఘోరం జరిగింది.
ఒక కరోనా వ్యాధిగ్రస్తుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శ్రీకాకుళం జిల్లా కు చెందిన జాంబలి నరసింహమూర్తి అనే 61 ఏళ్ల వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం అక్కడ కంటతడిపెట్టించింది.
నరసింహమూర్తి ఒక రిటైర్డ్ టీచర్. ఆయనకు కరోనా సోకడంతో విశాఖలోని వెంకోజిపాలెం ప్రధమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఇప్పుడు ఉరివేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.