ఆంధ్రప్రదేశ్లో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 143కు చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 శాంపిల్స్ను పరీక్షించగా మొత్తం 11 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా తెలిపారు.
నేడు కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయిందని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన కరోనా పరీక్షలో 143 మందికి పాజిటివ్గా తేలగా, 1321 మందికి నెగిటివ్గా నిర్ధారణ అయింది. మరో 409 మంది ఫలితాలు రావాల్సి ఉంది.