28.7 C
Hyderabad
April 25, 2024 04: 53 AM
Slider నిజామాబాద్

అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు

#Bichkunda Corona

కామారెడ్డి జిల్లా బిచ్కుంద  మండల కేంద్రంలో ఒకేసారి 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హుటాహుటిన అధికారులు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను హోం  క్వారంటైన్ కు  తరలించగా ఇంటి చుట్టుపక్కల తో పాటు మండల కేంద్రంలో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ పోలీస్ పంచాయతీ  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ప్రజలెవరూ బయటకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఎవరూ కూడా బయటకు రాకుండా ఉంటే కరొనా వైరస్ వ్యాప్తిని అరికట్ట వచ్చని తహశీల్దార్ వెంకటరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ తోపాటు ఇంచార్జి ఎంపీడీవో  సుధాకర్, మండల పరిషత్ అధికారి మహబూబ్, పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్ రెడ్డి ,ఎస్సై సాయన్న ,ఆరోగ్య బోధకులు దస్త్రిరాం, ఎంపీటీసీ శాంతాబాయి ధన్సింగ్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు గ్రామ రెవెన్యూ సహాయకులు పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.

Related posts

ఫేక్ ఎలిమినేషన్ తో రివర్స్ ఓపీనియన్

Satyam NEWS

మల్లాపూర్ డివిజన్ లో సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

క్రేజీ అంకుల్స్ ప్రెస్ మీట్ ఫొటో గ్యాలరీ

Satyam NEWS

Leave a Comment