కడప కేంద్ర కారాగారంలో 19 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకల సృష్టిస్తున్నది. ఇటీవల ఖైదీల నుంచి స్వాబ్ నమూనాలు సేకరించి పరిక్షించడంతో 19 మందికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
పాజిటీవ్ వచ్చిన వారందరినీ ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. అధికారులు అప్రమత్తమై జైలు పరిసర ప్రాంతాలను ద్రావకంతో శుభ్రం చేయించారు.