జనగామ సబ్ జైల్లో నలుగురు రిమాండ్ ఖైదీలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు జైలర్ వడ్త్యాల ఉపేందర్ తెలిపారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాండమ్ టెస్టులలో… 23 మంది రిమాండ్ ఖైదీ లు, తొమ్మిది మంది జైలు సిబ్బందితో కలిపి మొత్తంగా 32 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇందులో గత ఐదు రోజుల క్రితం జనగామ పట్టణ పోలీసులు పట్టుకున్న ద్విచక్ర వాహన దొంగల ముఠాలో నీ పది మంది లో నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వచ్చిందన్నారు. ఈ మేరకు జైలు సిబ్బంది పాజిటివ్ వచ్చిన ఖైదీలను వేరువేరు బ్యారక్ లో క్వారంటైన్ గా ఉంచామన్నారు.
వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు ఇస్తున్నామని చెప్పారు. జైలు సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు.