కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్యం వహించకుండా నివారణకు అవసరమైన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు పాటించాలని హైదరాబాద్ లోని రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ గంధం జోస్నా నాగేశ్వరరావు అన్నారు. రామంతాపూర్ డివిజన్ లోని పలు కాలనిలు రాంశంకర్ నగర్, ఈస్ట్ శ్రీనివాసపురం,వివేక్ నగర్ కాలనీ ల పరిసరాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.
అందుకోసం జి.హెచ్.యం.సి ఎంటమాలజి సిబ్బంది తో కలిసి సోడియం హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత వల్ల కరోనాను నివారించవచ్చు అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుండి ఒకరు బయటకు వెళ్లాలని తెలిపారు.