గోదావరిఖనిలో ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు. విఠల్ నగర్ 7బి కాలనీ లో నివాసం ఉండే ఒక వ్యక్తి లారీ డ్రైవర్ గా పని చేస్తాడు. వృత్తిరీత్యా రామగుండం నుంచి బొగ్గు లోడు వేసుకొని మహారాష్ట్రలోని సోలాపూర్ బొగ్గు తీసుకుని వెళ్లి తిరిగి బెంగళూరు హైదరాబాద్ ప్రాంతాల నుంచి గోదావరిఖని కి 2 రోజుల క్రితం వచ్చాడు.
వచ్చిన తర్వాత నుంచి జలుబు జ్వరం వచ్చాయని మంగళవారం సాయంత్రం 108 లో గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకు వెళ్లారు. కారోన వ్యాధి ఉందని అనుమానంతో బుధవారం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు.