సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలు విస్తృత పరచడంలో భాగంగా శుక్రవారం శ్రీనివాసపురం గ్రామంలో వరికోత,బోర్లు వేసే పనుల నిమిత్తం ఒడిస్సా రాష్ట్రం,ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలకు గ్రామ సర్పంచ్ పత్తిపాటి రమ్య నాగరాజు,గ్రామ కార్యదర్శి ఇందిరా,కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
గ్రామంలో 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 42 మందికి నెగిటివ్ గా నిర్ధారించడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు.45 సంవత్సరాల వయస్సు పైబడిన వారిని కరోనా టీకా చేయించుకొనేందుకు వారిని ప్రోత్సహించి 23 మందిని లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, శ్రవణ్, సైదులు, మస్తాన్ ఆశా కార్యకర్తలు సునీత, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.