సిద్ధం అవుతున్న ఐదు కరోనా వ్యాక్సిన్ లలో కనీసం ఒక్క వ్యాక్సిన్ కు ఈ నెలాఖరు లోపు అత్యవసర అనుమతులు మంజూరు చేసే అవకాశం కనిపిస్తున్నది.
ఈ అంశంపై ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐదు వ్యాక్సిన్లు మన దేశంలో తుది దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్నాయి. ఈ నెలాఖరుకు ఐదు వ్యాక్సిన్ లలో ఏదో ఒక వ్యాక్సిన్ కు అనుమతి వచ్చేస్తే దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే వీలు కూడా కలుగుతుంది.
బ్రిటన్ లో ఫైజర్ వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేసిన స్థితిలో మనదేశంలో కూడా అలానే జరిగే అవకాశం ఉందని గులారియా అన్నారు.