కువైట్ లో వడియ రాజుల సేవా సంఘం ద్వారా కరోనా కష్ట కాలం లో తెలుగు వారిని కులాల కతీతంగా ఆదుకుంటున్న తురక వెంకట సుబ్బయ్య పలువురి ప్రశంసలు పొందుతున్నారు. కడపజిల్లా పెనగలూరు మండల కు చెందిన వెంకట సుబ్బయ్య కువైట్ లో వడియ రాజుల సంఘం స్థాపించారు.
అక్కడ అనేక మందిని అందులో సభ్యులు గా చేర్పించారు. వారితో కలిసి సమావేశాలు నిర్వహిస్తూ కువైట్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేద వడ్డెర కులస్తులని వివిధ రూపాల్లో ఆదుకున్నారు. కరోనా కారణంగా జబ్బు పడిన వారిని ఆయన ఆదుకున్నారు. పెళ్లిళ్లకు తాళిబొట్టు పాటు కొంత మందికి నగదు కూడా అందించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న నేపధ్యంలో కువైట్ లో తెలుగు వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వారిలో కొందరిని ఇండియా కు పంపేందుకు ఇండియన్ ఎంబస్సి ద్వారా సహాయ సహకారాలు అందించారు. అక్కడ పనులు లేక ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేసి ప్రశంసలు పొందారు. ఈయన సేవలు గుర్తించి ఢిల్లీ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వారి నుంచి కరోనా వారియర్స్ ప్రశంసాపత్రం పొందారు.