అన్ని రంగాలలో వెనుకబడిన మున్నూరుకాపుల అభ్యున్నతికి వేయి కోట్లతో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ఉప్పల్ నియోజకవర్గం మున్నూరుకాపు కన్వీనర్ గంధం నాగేశ్వరరావు పటేల్ ఆద్వర్యంలో ఉప్పల్ తహసీల్దార్ గౌతమ్కుమార్ కు వినతి పత్రం అందజేశారు.
తహసీల్దార్ గౌతమ్కుమార్ సానుకూలంగా స్పందించి పరిస్కారానికి కృషి చేస్తానన్నారు. సందర్భంగా గందం నాగేశ్వరరావు పటేల్ మాట్లాడతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు సంఘం కన్వీనర్ పుటం పురుషాత్తం పిలుపు మేరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో సత్యనారాయణపటేల్ , వెంకన్నపటేల్, మురళీపటేల్, నవీన్పటేల్, తిప్పిరి రాజబాబుపటేల్, జగదీష్, పుప్పాల వెంకటేశ్, పలుగుల యాదగిరి, మహిళా మణులు ,యువకులు తదితరులు పాల్గొన్నారు.