26.2 C
Hyderabad
February 14, 2025 01: 22 AM
Slider పశ్చిమగోదావరి

ముడుపులు తీసుకుని కూడా పని చేయకపోతే ఎలా?

#curruption

ఏలూరు జిల్లాలో ఓ పంచాయతీ లో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలతో విచారణ జరుగుతున్నట్టు సమాచారం. ఈ విచారణ లో ఆ పంచాయతీ సర్పంచ్ పాత్ర ఉన్నట్టు రుజువైతే చెక్ పవర్ రద్దు కాకుండా చూస్తానని ఆ పంచాయతీ లో పని చేసే ఒక ఉద్యోగి సర్పంచ్ కి అభయమిచ్చినట్టు సమాచారం. సర్పంచ్ భర్త చేత గోల్డ్ తాకట్టు పెట్టించి సుమారు లక్ష రూపాయలు నగదు సర్పంచ్ చేతుల మీదగా ఆ ఉద్యోగి ఒక అధికారి చేతుల్లో పెట్టించినట్టు విశ్వసనీయ సమాచారం.

సదరు అధికారిని ఆ పంచాయతీ కి వీజిట్ పేరుతో ప్రత్యేకంగా పిలిపించి సర్పంచ్ తో ఆ అధికారికి ముడుపులు ముట్ట జెప్పించారని ఆ పంచాయతీ లో చెప్పుకుంటున్నట్టు సమాచారం. సొమ్ములు సమర్పించినప్పటికీ నిధుల దుర్వినియోగం పై భారీ ఎత్తున జరుగుతున్న విచారణ తీరును చూసి ఆ ఉద్యోగి చెక్ పవర్ ని కాపాడతానని ఇచ్చిన భరోసా పై నమ్మకం కోల్పోయిన సర్పంచ్ మానసిక వేదనకు గురై ముడుపులు తీసుకుని కూడా చెక్ పవర్ ఎక్కడ రద్దు చేస్తారో అనే అభద్రతా భావం తో ఆ సర్పంచ్ ముందుగానే న్యాయ స్థానాన్ని ఆశ్రయించినట్లు చెప్పుకుంటున్నారు.

Related posts

ఆళ్లగడ్డలో వైసీపీ దౌర్జన్యంపై డిజిపికి ఫిర్యాదు

Satyam NEWS

రాష్ట్రంలో ఉన్మాద పాలన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి

Sub Editor

మురుగు నీటిలో మునిగిపోతున్న ధర్మపురి కాలనీ

Satyam NEWS

Leave a Comment