37.2 C
Hyderabad
March 29, 2024 20: 37 PM
Slider శ్రీకాకుళం

కులాలను రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే

ycp leader

రాష్ట్రంలో కుల రాజకీయాలను పెంచి పోషించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అన్న మాటలు ఖండిస్తున్నామని, ఒక వేలు ముందుకు చూపిస్తే 4 వేళ్ళు వెనక్కు చూపిస్తాయన్న చందంగా ఉందని జిల్లా వైకాపా సీనియర్ నేత రొక్కం సూర్య ప్రకాష్ రావు పేర్కొన్నారు.

అవినీతిలో కూరుకుపోయిన అచ్చెన్న‌


ఈ మేరకు ఆయన మాట్లాడుతూ అవినీతిలో కూరుకు పోయి అచ్చెన్నాయుడు అరెస్టయినప్పుడు చంద్రబాబు బీసీ కులంలో రచ్చ చేయడానికి ప్రయత్నించిన సంగతి అందరకూ తెలిసిందేనన్నారు. తన సొంత గ్రామం నిమ్మాడలో తన దగ్గర బంధువులనే కాకుండా ఇతర కులాల్లో చిచ్చుపెట్టి కుల బహిష్కరణ చేసి చాకలి, మంగలి, పనివాళ్లను వాళ్ల ఇళ్లకు వెళ్లకుండా చేసి, నానా హింసలు పెట్టించిన అచ్చన్నకు కులాల కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు.


నీరు చెట్టు.. పుష్క‌రాల పేరుతో నొక్కేశారు..


అబద్ధాలతో ప్రజలకు మాయ చేసింది మీరు.. స్వార్థంతో రాష్ట్రాన్ని లూటీ చేసింది మీరు.. నీరు- చెట్టు పేరుతో నిలువునా దోచుకున్నది మీరు.. గోదావరి పుష్కరాలు పేరిట మూడు వేల కోట్లు తినేసి 30 మందిని పొట్టన‌ పెట్టుకున్నది మీరు.. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు అర్ధాంతరంగా పెంచేసి కోట్లు కొల్లగొట్టింది మీరు.. మీ పై ఉన్న కేసులు నుండి తప్పించుకోవడానికి జడ్జీలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మీరు.. పోలవరం విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులకు దొంగ లెక్కలు రాసింది మీరని కాగ్ చెప్పకనే చెప్పిందన్నారు.


కింజరాపు అశోక్ మ‌ర‌ణం నిజాలు ప్ర‌జ‌ల‌కు తెలుసు


సొంత బాబాయ్ పై జరిగిన కత్తిపోటు వెనుక వాస్తవాలు గురించి ముఖ్యమంత్రిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన అచ్చన్న నిమ్మాడలో తన సొంత తమ్ముడు కింజరాపు బుజ్జి పై గున‌పం పోటు వెనుక ఉన్న వాస్తవాలు ఆనాడే ప్రజలు తెలుసుకున్నారని, అది ఎప్పుడైనా బయటకు తీయొచ్చు అన్నారు. జిల్లాలో జరిగిన సైకిల్ యాత్ర కోసం అప్పు చేయించి సుమారుగా రెండు కోట్లు రూపాయలు ఖర్చు పెట్టించి ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కింజరాపు అశోక్ వెనకాల ఉన్న రహస్యం అందరికీ తెలిసిందేనని ఇప్పుడైనా దాన్ని బయటికి తీయొచ్చు అన్నారు.


లోకేష్‌కు వ‌ర్షానికి, వ‌ర‌ద‌కు తేడా తెలియ‌దు..


అధికారం కోల్పోయినప్పుడల్లా టీడీపీ నాయకులకు పిచ్చి ముదిరి పాకాన పడుతుందని ఎద్దేవా చేశారు. మీ పాలనలోనే పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలించి వేల కోట్లు కొల్లగొట్టింది మీరే కదా.. అని ధ్వజ మెత్తారు. వర్షానికి.. వరదకి తేడా తెలియని లోకేష్ రైతుల కోసం మాట్లాడే అర్హత లేదన్నారు. తిత్లి తుఫాన్ లో నష్టపోయిన రైతులకు బాబు గారు ఇచ్చిన బొమ్మ చెక్కులు నేటికీ బొమ్మగానే మిగిలింద్నన్నారు. పోలవరం ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తి చేశామన్న లోకేష్ అందులో 80% నిధులు గోల్‌మాల్ చేయడాన్ని ఎందుకు చెప్పట్లేదని రొక్కం ధ్వజమెత్తారు. రైతుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీయే అన్నారు.


పేదలకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇచ్చే విషయంలో తెదేపా కోర్టుకు వెళ్లకుండా ఉన్నట్లయితే… ఈ పాటికి లక్షలాది ఇల్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు కట్టించేవారన్నారు.

Related posts

నిషేధిత గుట్కా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు

Satyam NEWS

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే గీత ఆద్వ‌ర్యంలో టీడీపీ వ్య‌వస్థాప‌క దినోత్స‌వం..!

Satyam NEWS

Leave a Comment