విజయనగరం జిల్లాలో జేడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్ ప్రశాంతంగా సాగుతోందని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ అన్నారు. జిల్లాలో మూడు డివిజన్ లలో సంబంధిత సిబ్బంది నిర్వహిస్తున్న బందోబస్తు ను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. తాజాగా జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ లో జరుగుతున్న కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్పీ తనిఖీ చేసారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద దాదాపు 30 మంది సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు.
కౌంటింగ్ కేంద్రంలో పరిస్థితిని స్వయంగా చూసిన ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. పార్వతీ పురం డివిజన్ లో మెరకముడిదాం లో ఏర్పడిన ఇబ్బంది తమ దృష్టికి వచ్చిందన్నారు.34 కేంద్రాలలి 31 కౌంటింగ్ కేంద్రాల వద్ద తమ సిబ్బంది బందోబస్తు సక్రమంగా నిర్వహిస్తున్నారన్నిరు. కరోనా నిబంధనలు సిబ్బంది పాటించడంతో పాటు కేంద్రంలోనూ కేంద్రానికి వచ్చే సిబ్బంది ప్రతీ ఒక్కరూ పాటించే విధంగా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారన్నారు.