30.2 C
Hyderabad
February 9, 2025 20: 17 PM
Slider కడప

రాజంపేట కోర్టులను పరిశీలించిన హై కోర్టు జడ్జి వెంకట రమణ

Bar Association

నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయిన నేపథ్యంలో కడప జిల్లా నందలూరు కోర్టు లోని భవనాలను రాష్ట్ర హై కోర్టు జడ్జి వెంకట రమణ పరిశీలించారు. రూ.4.80 కోట్లతో నందలూరు కోర్టు అభివృద్ది, క్వార్టర్స్ ల నిర్మాణానికి మరో కోటి ఖర్చు చేయనున్నారని నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహులు తెలిపారు.

అలాగే రాజంపేట కోర్టు ను కూడా పరిశీలించారు. ఇక్కడ కూడా నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శ్రీనివాస్, 3 వ అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, రాజంపేట సీనియర్ జడ్జి శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి ఫైజున్నిస్సా వున్నారు.

ఈ సందర్భంగా రాజంపేట, నందలూరు కోర్ట్ లో న్యాయమూర్తి వెంకటరమణని న్యాయ వాదుల సంఘం ప్రెసిడెంట్ నరసింహులు, ఏ జి పి సమీఉల్లా ఖాన్ ,న్యాయవాదులు మల్లి కార్జున, షేక్ సుబ్బరామాయ్య, వినయ్, కృష్ణారెడ్డి లు సన్మానించారు.

Related posts

కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా ఆరోగ్యం విషమం

Satyam NEWS

విద్యల నగరంలో వ్యాపారి కిడ్నాప్…24 గంటలలో కేసు ఛేదింపు

Satyam NEWS

బిక్కు బిక్కుమని బతుకుతున్న టీడీపీ శ్రేణులు

mamatha

Leave a Comment