ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనేది అభియోగం.
ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ అప్పట్లో కోదాడ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
ఇదే కేసులో ఏ 2 ఏ 3 లపై కేసులను కొట్టేశారు.
అయితే ఏ 1 గా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.