జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి లపై మరో కేసు నమోదు అయింది. జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు పెట్టేశారు.
కడపజిల్లా జైలు వద్ద నిబంధనలు ఉల్లంఘించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి పై సెక్షన్స్ 143, 341, 506, 188,286, 34 ipc కింద కేసు నమోదు చేశారు.
గురువారం కడప జైలు వద్ద బెయిల్ పై విడుదలైన సందర్భంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. అదే విధంగా 31 మంది టీడీపీ కార్యకర్తల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.