కనుమ పండుగ రోజు గోమాతను పూజించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇదే సాంప్రదాయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో కొనసాగించారు.
గోమాతకు షోడశ ఉపచార, గోమాత అష్టోత్తర పూజ కార్యక్రమం నిర్వహించారు. గోమాతకు ప్రార్ధనా నమస్కారంతో పూజ ప్రారంభించి సకల పూజా కార్యక్రమాన్ని సంప్రాదయ బద్దంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కంచిభట్ల పవన్ కుమార్ శర్మ ఆలయ ధర్మకర్త కర్పూరం నాగరాజు, లక్ష్మీ కుమారి దంపతులుతో చేయించారు. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.