28.7 C
Hyderabad
April 25, 2024 05: 11 AM
Slider కడప

అమానుషం…దారుణం… ఎలా చెప్పాలి ఈ మూగజీవులు

#cow slator

దారుణం… అమానుషం…. ఇలాంటి ఎన్ని పదాలు చెప్పినా సరిపోదు…. వీరు చేస్తున్న దారుణ మారణ కాండకు ముగింపు రాదా? అమ్మ తర్వాత అమ్మగా కొలుచుకునే ఆవును కబేలాలకు తరలిస్తున్నారు… ఆవును కాపాడాలని ఎంతో మంది పిలుపునిస్తుంటే… అదే ఆవును అడ్డంగా నరికేస్తున్నారు దుర్మార్గులు…

కడప జిల్లా చింతకొమ్మదిన్నె  మండలంలో ఈ రాక్షస కృత్యం వెలుగులోకి వచ్చింది. చింతకొమ్మ దిన్నె  మండలం రాయచోటి హైవె వద్ద బిజెపి కార్యకర్తలు అనుమానాస్పదంగా ఉన్న ఒక లారీని ఆపి చెక్ చేయగా అక్రమంగా నలభై నుంచి యాభై ఆవులను  తమిళనాడు కి తరలిస్తున్నారు. 

స్థానికంగా ఉన్న మిగతా కార్యకర్తలు కూడా వచ్చి పరిశీలిస్తే అత్యంత అధ్వానంగా  అత్యంత ఇరుకు ప్రదేశం లో ఆవులు దయనీయ స్థితిలో ఉన్నాయి.  దీనికి సంబంధించి లారీ డ్రైవర్ ను ప్రశ్నించగా ఆవులను తరలించేందుకు సంబంధిత పేపర్లు గానీ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ గాని  పంచాయతీ అనుమతి గాని లేదు.

గోవధ నిషేధ చట్టం అమలులో ఉన్నా దానిని పాటించక హిందువులకు ఆరాధ్య దైవం అయిన గోవులను అక్రమంగా ఒక ప్రదేశం నుంచి ఇతర  ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇలా ఆవులతో ఉన్న రెండు లారీలను సికె దిన్నె పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కడప డిఎస్పీ సునీల్ కు ఫిర్యాదు చేయడం తో రెండు లారీలను సికే దిన్నె స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ చంద్ర, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో మారిన బ్యాంకు పని వేళలు

Satyam NEWS

రఘురాముని అరెస్ట్ పై క్షత్రియుల నల్ల బ్యాడ్జీల నిరసన

Satyam NEWS

మాయావతి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్?

Satyam NEWS

Leave a Comment