30.7 C
Hyderabad
April 19, 2024 08: 43 AM
Slider కరీంనగర్

కేర్ టేకర్స్:కానిస్టేబుల్ కుటుంబానికి సిపి పరామర్శ

cp kamalasan reddy paid homage constable family .

విధి నిర్వహణలో భాగంగా మానే బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాద స్థలానికి వెళ్లి అదుపుతప్పి బ్రిడ్జి కింద పడి చికిత్స పొందుతూ ఆదివారం నాడు మృతిచెందిన వన్ టౌన్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కుటుంబాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి పోలీస్ అధికారుల అసోసియేషన్ ప్రతినిధులు పరామర్శించారు.

తొలుత ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం చికిత్స పొందుతున్న ఆస్పత్రికి పోలీస్ కమిషనర్ వెళ్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.అకస్మాత్తుగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.

పోస్టుమార్టం అనంతరం కరీంనగర్ లోని వావిలాలపల్లి గల ఆయన నివాసానికి పోలీస్ కమిషనర్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (పరిపాలన) జి చంద్రమోహన్, టౌన్ ఏసిపి డాక్టర్ పి అశోక్, అసోసియేషన్ ప్రతినిధులు

యం సురేందర్, తుల శ్రీనివాసరావు, ఎస్బిఐ ఇంద్రసేనారెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, ఎస్ఐలు శ్రీధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముగురమ్మల దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

Satyam NEWS

అధ్యక్షా ఇది చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాజకీయం

Satyam NEWS

బిజెపిని గద్దె దించడమే కమ్యూనిస్టుల ప్రధాన ధ్యేయం

Bhavani

Leave a Comment