32.2 C
Hyderabad
April 20, 2024 20: 07 PM
Slider అనంతపురం

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోంది

cpi-ramakrishna

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వార్తలు రాయకూడదు.. ప్రచురించకూడదంటూ జీవో 2430ను విడుదల చేయడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే పత్రికలు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జీవో 2430కు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రులే ఎంస్‌వోలను బెదిరించి అప్రకటితంగా ఏబీఎన్ ఛానల్‌ను నిషేధించారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే జీవో 2430ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

లాక్ డౌన్ ఉన్నా కొనసాగిన తబ్లీఘ్-ఈ-జమాత్‌ సదస్సు

Satyam NEWS

పెన్షన్ ర్యాలీ: కదం తొక్కిన సీపీయస్ ఉద్యోగులు

Satyam NEWS

తహశీల్దార్లకు పదోన్నతులు

Bhavani

Leave a Comment