32.2 C
Hyderabad
March 29, 2024 00: 45 AM
Slider ఆదిలాబాద్

సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్

cpm bheem

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా  మార్కెట్ యార్డ్ లోపత్తి కొనుగోలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)CPI (M) కుమురం భీం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నేడు మీడియా సమావేశంలో cpm రాష్ర్ట కమిటీ సభ్యులు బి. రవికుమార్ మాట్లాడుతూ కుమురం భీం జిల్లాలో మార్కెట్ యార్డ్ లలో పత్తి కొనుగోలు చెయ్యడం లేదని, దళారులకే రైతుల భవిష్యత్ ను మోడీ, కెసిఆర్ ప్రభుత్వాలు తాకట్టు పెట్టాయని అన్నారు. ప్రభుత్వాలు  ప్రకటించిన గిట్టబాటు ధరలను తామే అమలు చెయ్యకుండా తమ మాటలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయని అన్నారు. జిల్లాలో 3 లక్షల 37 వేల 500 ఎకరాలలో పత్తి సాగు అవుతుంది. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మార్కెట్ యార్డ్ లలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో CCI కొనుగులు కేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కానీ అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఎవరు కూడా తమ కు బాధ్యత లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఇదే అవకాశం అన్నట్టు గా భావించిన దళారులు కేవలం మూడు వేల నుండి నాలుగు వేల రూపాయల మధ్య  లో మాత్రమే కొనుగోలు చేస్తూ రైతుల ను నిలువు దోపిడి చేస్తున్నారు.  దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అంచనా కట్టేదాంట్లో 33 శాతం కి మించి నష్టం ఉన్నదాన్నే పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు నిబంధనలు పంపింది. ఇందువల్ల పంట నష్టం కూడా ఏమి జరగలేదని నివేదికలు తయారు అయ్యాయి. దీనితో జిల్లాలో పడ్డ వర్షాల ఫలితంగా నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం అందకుండా పోయింది. దీనికి తోడు పత్తి కొనుగోలు చేస్తున్న జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు తేమ శాతం పేరుతో  రైతులను వేధిస్తూ తక్కువ రేటు కి కొనుగోలు చేస్తున్నారు. దీనితో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.12 శాతం పైగా తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వం బేషరతుగా పత్తి కొనాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికంగా పడిన వర్షాలు, చలి తీవ్రత నేపథ్యంలో తేమ శాతం కు మినహింపు ఇవ్వాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ లో cpm జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్, పట్టణ కార్యదర్శి ముంజం. ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

Related posts

బీజేపీ ఎంఎల్సీ అభ్యర్ధి మాధవ్ ను గెలిపించండి…!

Satyam NEWS

మాయమాటలు చెప్పడంలో సిద్ధహస్తుడు సీఎం కేసీఆర్

Satyam NEWS

“ఆరోగ్య మహిళ”కు విశేష స్పందన: మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

Leave a Comment