ఎన్నికలు వచ్చిన ప్రతి సారి హామీలే తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమౌతోందని, నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు పంచాలని సిపీఎం కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 25న చలో కలక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిపీఎం కార్యదర్శి ఎర్రం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు రామంతపూర్ డీమార్టు వద్ద అడ్డా కార్మికులతో కలిసి నిర్సన ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లయినా పేదలకు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఇంటి హామీ కలగానే మిగిలి పోయిందన్నారు. నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు ను వెంటనే పేదలకు పంచాలన్నారు. కార్యక్రమంలో చలపతి, నారాయణ, శ్రీనివాస్ ,సైదులు, వెంకన్న, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
previous post