జనం కోసం సీపీఎం కార్యక్రమం లో బాగంగా వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ విజయనగరం 53 వ సచవాలయం వద్ద ధర్నా చేశారు..సీపీఎం పార్టీ నేతలు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ నగరంలో పూరిల్లున్న చోటే జగనన్న ఇల్లు ప్రభుత్వమే కట్టాలి. లేదంటే జి. ఓ నెంబర్ 225 ప్రకారం 75 గజాలు స్థలం రెగ్యులర్ చేసి ఆరు లక్షలు మంజూరు చేయాలని కోరారు.
నగరంలో ఎల్.బీ.జీ నగర్, రామకృష్ణా నగర్,జొన్న గుడ్డి , బుంగ వీది,నల్ల చెరువు తో పాటు గంజిపేటలో దళితులు నివాసముంటున్న కాలనీలో ఇంటి పట్టాలు లేవు అని వాటికోసం ఇప్పటికే పలు మార్లు పోరాడామని తెలిపారు. పై సమస్యలు పై సీపీఎం పోరాడుతుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేవరకు మీకు అండగానిలిచేందుకు సీపీఎం నాయకత్వం ఎప్పుడూ సిద్ధమేనని తెలిపారు.
అలాగే జి. వో నెంబర్ 225 ప్ర కారం ప్రభుత్వ స్థలంలోనే 75 గజాలు ఉచితంగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసారు. కానీ అపని ప్రభుత్వం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు.తక్షణం ఈ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు సింహాచలం, కృష్ణవేణి రామలక్ష్మి తది తరులు పాల్గొన్నారు.