విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సీపీఎం పాదయాత్ర చేపట్టందని..ఆ పార్టీ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు , జె.వి.సత్యనారాయణ మూర్తి సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు జల్లి, విల్సన్ పి.జె.చంద్రశేఖర్ ఎలుగెత్తి నినదించారు.
ఈ మేరకు శ్రీకాకుళం నుంచీ మొదలైన పాద్రయాత్ర…జిల్లా కేంద్రంలోని నీళ్ల ట్యాంక్ వద్దకు చేరుకుంది.ఈ సందర్బంగా రాష్ట్ర నేతలు మాట్లాడారు.ఏడున్నర ఏళ్లుగా కేంద్రంలో అధికారం చేపట్టిన మోడీ….అదానీ, అంబానీలకు దేశ ఆర్దికవ్యవస్థను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
పేద,మధ్య తరగతి కుటుంబాలు బతుకులు ఈడ్చలేక, పిల్లలను చదివించుకోలేక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కును పరిరక్షించుకుంటే…దేశాన్ని దేశ అర్దికవ్యవస్థను పరిరక్షించుకునే వాళ్లం అవుతామన్నారు.
ఆ ఉద్దేశ్యంతో సీపీఎం సిక్కోలు నుంచీ గుంటూరు వరకుపాదయాత్ర చేపట్టిందన్నారు. ఈనెల 21న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సీపీఐ నేతలు తెలిపారు.