విజయనగరం జిల్లా కేంద్రంలోబీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నె ల 24 న విజయనగరంలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు.
ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద లావు గంగాధర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత్ బంద్ కు మద్దతునిస్తూ… నిర్వహించనున్న ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు.
ఈసందర్బంగా రెడ్డి శంకరరావు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చ ఏడున్నరేళ్లు అవుతున్నా….కార్పొరేట్ సంస్థలకు తగ్గట్టుగానే ఆదానీ,అంబానీలకు మద్దుతు ఇచ్చే విధంగాపాలన సాగుతోందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపు నిచ్చిన నేపధ్యంలోజిల్లా ప్రజలను అలెర్ట్ చేసే పనిలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు రెడ్డి శంకరరావు తెలిపారు.