విశాఖపట్నంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి ఇప్పటికి పది మంది మరణించారు. ఒక్కసారిగా భారీ క్రేన్ కుప్పకూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇంకా ఎంతో మంది ఈ ప్రమాదంలో గాపడ్డారు.
మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు.