ఈ నెల 10,11,12 తేదీలలో ఏపీలోని విజయనగరం జిల్లా కేంద్రం లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం విజయనగరం జిల్లా నేతలు గోవిందరావు,రాకేష్ శర్మలు తెలిపారు.
జిల్లా కేంద్రంలో బాబామెట్ట బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో వర్చువల్ మీటింగ్ ద్వారా ఈ విషయాన్ని తెలియ జేసారు.బ్రాహ్మణులందరికీ ఏకత్రాటిపై తీసుకు వచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడలను నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ మెన్ రాకేష్ శర్మ తెలిపారు.
ఈ మేరకు స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ ను ,జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.