తన గురించి, తన బంధువుల గురించి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెడుతూ, కించపరుస్తూ పరువుకు భంగం కలిగించారని ఖమ్మం అర్భన్ పోలీస్టేషన్ లో కేసు నమోదు అయింది. శివకుమార్ పట్నాయక్ (విశాఖపట్నం), సంకసర్ల సువర్ణ (మంచిర్యాల), ఎస్.కే.గౌస్ పాషా (హైదరాబాద్), బిరుదుల దేవరాజ్ (మంచిర్యాల) అనే వ్యక్తులపై శ్రీనివాస్ రావు అననే వ్యక్తి ఖమ్మం అర్బన్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
క్రిమినల్ కేసు ( నెం.167/2020, Us. 504, 505, 506, Ipc 67డి.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్ట ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అర్భన్ సిఐ వెంకన్నబాబు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన వివరించారు. అదే విధంగా సైబరాబాద్ లో కూడా మరో కేసు నమోదు అయింది.
అభ్యంతరకరమైన పోస్టులు అప్ లోడ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పై నలుగురిపై సైబరాబాద్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. పట్నాయక్ అతని బృందం చేసిన ప్రతి అప్ లోడ్ కు ఒక కేసు పెట్టాలని బాధిత కుటుంబాలు భావిస్తున్నాయి.