28.2 C
Hyderabad
May 24, 2025 09: 28 AM
Slider జాతీయం

న్యాయ వ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం

#Raghuramakrishnam Raju MP

న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టం కల్గుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ ఎంపి కె. రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు.

రాజధాని మార్పు వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని, అలాంటిది ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదని ఆయన హితవు పలికారు.

అయినా ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదని ఆయన అన్నారు. రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని ఇప్పుడు వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు.

Related posts

రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

క్రైమ్ స్టాఫ‌ర్ నెంబ‌ర్ స్థానంలో…బాధితుల కోసం కొత్త వాట్సాప్ నెంబ‌ర్..!

Satyam NEWS

ఉద్యమకారులు రోడ్డుపై.. ద్రోహులు మంత్రివర్గంలో..

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!