న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం చేయడం వల్ల ప్రభుత్వానికే నష్టం కల్గుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ ఎంపి కె. రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ హైకోర్టు కోరడం మంచి పరిణామం అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని మార్పు వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉందని, అలాంటిది ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదని ఆయన హితవు పలికారు.
అయినా ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదని ఆయన అన్నారు. రాజధానిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని ఇప్పుడు వారికి ఇబ్బంది కలిగించొద్దని కోరారు.