33.2 C
Hyderabad
April 26, 2024 02: 58 AM
Slider చిత్తూరు

తుపాకీతో కాల్చుకుని ఆర్.పి.ఎస్.ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

#ARConstable

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బారక్స్ లో డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున 4:15గంటలకు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరిపురం ఆనందరావు(30) ఆర్పిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా రేణిగుంట నందు విధులు నిర్వహిస్తున్నాడు.

ఇటీవల సొంత గ్రామానికి వెళ్లిన ఆనందరావు ఈనెల 2వ తేదీ తిరిగి డ్యూటీ కి జాయిన్ అయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

అధికారుల ఒత్తిడి వల్లనే ఈ ఆత్మహత్య కు కారణం అని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Related posts

రాష్ట్ర సాధన కోసం  ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు

Satyam NEWS

క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం..

Sub Editor

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

Satyam NEWS

Leave a Comment