28.2 C
Hyderabad
May 24, 2025 09: 22 AM
Slider గుంటూరు

గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు

#Chadalawada

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై సత్వర న్యాయం చేయాలని గుంటూరు జిల్లా నకరికల్లు పంచాయితీ పరిధిలోని శివాపురం తండాలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నేడు ధర్నా జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజాసంఘాలు, నర్సరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు.

మృతదేహంతో తండా రోడ్డుపై బైటాయించిన ప్రజా సంఘాలు  కుల నిర్మూలన పోరాట సమితి స్టేట్ కార్యదర్శి కృష్ణ, పిడిఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శి మస్తాన్ వలి ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం శ్రీనివాస్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా మంత్రి నాయక్ కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా వారందరూ డిమాండ్ చేశారు. తక్షణమే సంఘటనా స్థలానికి తహశీల్దార్ ప్రశాంతి చేరుకుని  నాయక్ కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలందించేందుకు లేఖ రాసి పంపిస్తాను అని హామీ ఇవ్వటంతో ధర్నా విరమించారు.

Related posts

జగన్ పాలన: అవినీతి సంత..అడుగుకొక గుంత…

Satyam NEWS

చివ‌రి షెడ్యూల్లోకి ఎంట‌రైన ‘ట‌క్ జ‌గ‌దీష్‌’

Satyam NEWS

ఎయిడెడ్ కాలేజీ విద్యార్ధుల ఆందోళనకు టీడీపీ మద్దతు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!