దళిత మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ని కఠినంగా శిక్షించాలని జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరం మల్లీశ్వరి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ పోలీసు స్టేషన్ లో జరిగిన లైంగిక దాడి వ్యతిరేకంగా బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ సహచర మహిళా ట్రైనీ ఎస్ఐ పై లైంగిక దాడికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాసరెడ్డి పై ఎస్సీ,ఎస్టీ, అత్యాచారం క్రింద కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రక్షణగా నిలవాల్సిన పోలీసులే లైంగిక దాడులకు పాల్పడుతుంటే ఇక మహిళలకు రక్షణ ఎక్కడుందని అన్నారు.ప్రభుత్వాలు నిర్భయ చట్టం తీసుకొచ్చినా మహిళలపై దాడులు ఆగటం లేదని, మహిళా ఎస్ఐ కే సరియైన రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు దేవరం సుజాత,సిగినం పుల్లమ్మ,అమరబోయిన వీరమ్మ,పద్మ,వెంకటమ్మ,జయమ్మ,పుష్పమ్మ,అరుణ,లక్ష్మమ్మ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్