జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఈ నెల 30వ తేదీన అంతర్జాతీయ జానపద దినోత్సవం నిర్వహిస్తున్నారు. సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో డప్పు, కోలాటం బృందాలు, భరతనాట్యం, కూచిపూడి డ్యాన్స్ బృందాలు, గాయకులు వివిధ కళారూపాలు ప్రదర్శిస్తారు. సకల కళా సాంస్కృతిక మండలి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సుధాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బిక్షపతి కామ గాని కిరణ్ కోశాధికారి రాజేష్ ప్రచార కార్యదర్శి నరసింహస్వామి సహాయ కార్యదర్శి గూడూరు నాగరాజు బండి సులోచన కీర్తి సమ్మక్క మంగళపల్లి కమలమ్మ కొత్త సుమలత తదితరులు ఈ వివరాలను వెల్లడించారు.