రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచీ రాత్రి పూట కర్ఫ్యూ పెట్టాలని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే కర్ఫ్యూ విధిస్తారన్న వార్తల మీదట సంబంధిత జిల్లా పోలీసు శాఖ లం చర్యలు తీసుకునే పనిలో పడ్డాయి. ఈ మేరకు అన్ని పోలీసు డివిజన్ లలో సంబంధిత పోలీసులు సమావేశాలు నిర్వహించారు కూడా.
ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ ఆదేశాలతో జిల్లా లో అన్ని డివిజన్ ల పోలీసు అధికారులు చర్యలు ప్రారంభించారు.
ఇందులో భాగంగా విజయనగరం డీఎస్పీ అనిల్..తన కార్యాలయంలో సంబంధిత సీఐలతో ముందస్తుగా నే సమావేశం నిర్వహించారు.
ఉత్తర్వులు రాకుండా నే ముందస్తుగా డీఎస్పీ రాత్రి పూట కర్ఫ్యూ పై చర్యలు తీసుకునేందుకు సమావేశం నిర్వహించారు.
అనంతరం ప్రభుత్వం రాత్రి ఏడుగంటల సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలంటూ అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ మేరకు జిల్లా లో అన్ని జంక్షన్ ల వద్ద చెక్ పోస్టులు పెట్టి..జిల్లా సరిహద్దు వద్ద రాకపోకలను కట్టడి చేసారు.రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమలు కానుంది.