తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సెల్యూట్ చెయ్యాలి. ఇంట్లోనే వీధి విద్యుత్ స్తంభాలు పెట్టి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇంట్లో వారు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి విద్యుత్ ఇస్తే చాలు అనుకున్నట్లు ఉంది. అందుకే ఆ శాఖ అధికారులు ఆవిధంగా పనిచేస్తున్నారు. ఇంట్లో వారికి కాకుండా చుట్టుపక్కల వారికి కూడా కరెంటు రివర్స్ వచ్చే విధంగా పనిచేస్తున్నారు.
ఇది ఎక్కడా అంటారా…కొల్లాపూర్ మున్సిపల్ పట్టణం 11వ వార్డు ఇందిరా కాలని బండయా గుట్ట క్రింద… ఈ విషయంపై బాధితులు స్థానిక ఏఇ వెంకటేష్ కు ఎన్ని సార్లు చెప్పిన చూద్దాం అంటున్నారంట కానీ చేయడం లేదు. విద్యుత్ షాక్ తో చనిపోయినాక శవాలను చూస్తారేమో? ఇది వీరి పనితీరు.
నిన్న రాత్రి వర్షం రావడంతో ఇంట్లో వారికి చుట్టుపక్కల వారికి ఎర్త్ వచ్చింది దాంతతో వారు భయాందోళనకు గురైయ్యారు. కనీసం పాలకులు ఆయిన పట్టించుకుంటారో లేదో చూడాలి. పట్టణ ప్రణాళికలో కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు.