సైబర్ భద్రత కు సంబంధించిన అంశాలలో విద్యార్ధినీ విద్యార్ధులకు సరైన అవగాహన కల్పించేందుకు నిర్దేశించిన CybHER – పాఠశాల కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నది. తెలంగాణ పోలీసు శాఖ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ లోని సింబయాసిస్ లా స్కూల్ లీగల్ ఎయిడ్ సెంటర్ సంయుక్తంగా నేడు ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
నేటి తరం పిల్లలు సాంకేతికతకు బాగా అలవాటు పడిపోయారా? అనే అంశంపై ఈ ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమం జరిగింది. సైబర్ భద్రతపై పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు. భద్రతాదళాల మీడియా ట్రైనింగ్ ఇన్ స్ట్రక్టర్ జూహి కౌల్ ఈ లైవ్ కార్యక్రమంలో పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు.
పిల్లల రక్షణ, వారి బాగోగులపై సాంకేతికత ప్రభావాన్ని ఆమె వివరించారు. మన జీవితంలో సాంకేతిక ఒక భాగం కావాలి కానీ సాంకేతికతే జీవితం కారాదని ఆమె వివరించారు.