వరల్డ్ పోలియో డే సందర్భంగా రోటరీ, నర్తనశాల సంయుక్తంగా విజయనగరం జిల్లా కేంద్ర మైన విజయనగరం లో కోట జంక్షన్ నుంచీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు కోట జంక్షన్ వద్ద నుంచీ సైకిల్ ర్యాలీ ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులతే మస్త్..మస్త్ గా ధూమ్ ధామ్ కార్యక్రమాలు జరిగాయి. పాఠశాల ,కళాశాల పలు సంస్థల పిల్లలచే డ్యాన్స్ పోటీలు జరిగియి. ఈ పోటీలను ఆద్యంతం ఎమ్మెల్యే కోలగట్ల తిలకించారు. ప్రధానంగా నర్తనశాల నృత్య అకాడమీ పిల్లలు చేసిన డ్యాన్స్ చూపరులను ఆకర్షించింది.
ఈ ర్యాలీ ని ఉద్దేశించి ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎనలేని సేవలు చేస్తోందని అందులో పోలియో నిర్మూలన ఒకటి అని అన్నారు. అనంతరం కోట జంక్షన్ వద్ద నుంచీ ప్రారంభమైన ర్యాలీ మూడులాంతర్లు, గంటస్థంబం, బాలాజీ వరకు కొనసాగింది