అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పాచికాలువ కు చెందిన తెలుగుదేశం పార్టీకి, రాజంపేట తెలుగు దేశం ఇంచార్జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు వీరాభిమాని నాగరాజు తెలుగుదేశం పార్టీ చిత్ర పటాలు ముద్రించిన పసుపు పచ్చని సైకిల్ పై శుక్రవారం తెల్లవారు జామున బ్రహ్మాంగారి మఠానికి సైకిల్ యాత్ర చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి భత్యాల చెంగల రాయుడు టీడీపీ ఎమ్మెల్యే గా గెలుపొందాలని బ్రహ్మాంగారి మఠంలో మూడు నెలల మాల ధారణ ధరించనున్నట్లు మీడియాకు తెలిపారు.
previous post
next post