తెలంగాణా రాష్ట్ర దడవాయి సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయ్ కుమార్ కు వనపర్తిలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
వనపర్తి టిఆర్ఎస్ పార్టీ తరపున వనపర్తి మునిసిపల్ ఛైర్మన్ గట్టుయాదవ్, మాజీ ఛైర్మన్ పలుస రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రాష్ట్ర యువజన దినోత్సవం సందర్భంగా విజయకుమార్ కు సన్మానం చేశారు.
యువకుడైన విజయ్ సింగిల్విండో చైర్మన్ గా, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ గా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికై ఈరోజు రాష్ట్ర సంఘం అధ్యక్షులు స్థాయికి ఎదిగాడని ఈ సందర్భంగా వారు తెలిపారు.
కార్మికుల శ్రేయస్సుకోసం పార్టీ మనుగడ కోసం ఉపయోగపడే విధంగా సేవలు అందించాలని వారు విజయ్ ని అభినందిస్తూ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బండారు కృష్ణ, పాకనాటి కృష్ణ, నాగన్న యాదవ్ పుట్టపాక మహేష్, నక్క రాములు మాజీ కౌన్సిలర్ ఆవుల రమేష్, నందిమల్ల శ్యామ్,
ఉంగలం తిరుమల్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యుగంధర్ రెడ్డి, యువజన సంఘం అధ్యక్షుడు సూర్యవంశం గిరి, విద్యార్థి సంఘం నాయకులు హేమంత్, భాగ్యరాజు, రామస్వామి, శ్రీను, టిఆర్ఎస్ నాయకులు విక్రం, సుభాష్, శ్రీను పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి