దేశంలో సుమారుగా నాలుగు కోట్ల మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఐఎల్ఓ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కార్మికులు ఉపాధి లేక ఆకలితో పస్తులుంటున్నారని ఇంటర్నేషనల్ కొయలేషన్ ఫర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తెలిపింది.
ఇండియా, బ్రెజిల్, నైజీరియా దేశాలలో లాక్ డౌన్ పై పరిశీలన జరిపిన ఐఎల్ఓ ఈ అంచనాకు వచ్చింది. దేశంలోని కార్మికులలో దాదాపుగా 90% మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. సాధారణంగా పారిశ్రామిక మందగమనం వల్ల ఉపాధి కోల్పోయిన కార్మికులపై లాక్ డౌన్ పిడుగులా పడిందని ఐఎల్ఓ అభిప్రాయపడింది.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తీవ్రమైన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కుంటోందని ఐఎల్ఓ పేర్కొంది. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్లకు పైగా కార్మికులు ప్రభావితమయ్యారు.