ఏలూరు జిల్లా భీమడోలు లో చంద్రమౌళి ప్రహరి కూల్చివేత పై దళిత సంఘాల నాయకులు చంద్రమౌళి కి అండగా నిలిచారు. పంచాయతీ చర్యను ఖండించారు. పంచాయతీ సిబ్బంది చంద్రమౌళి కుటుంబం పట్ల వ్యవహరించిన తీరు పై దళిత సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎస్ పి ,డి ఎస్ పి ,డి పి ఓ కార్యాలయాలకు వెళ్ళి అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ భీమడోలు గ్రామపంచాయతీ లో ఇటీవల జరిగిన కోటి రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగం పై భీమడోలు గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి చంద్రమౌళి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగే( పి జి ఆర్ ఎస్)ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ తరువాత లోకాయుక్త కోర్ట్ కి పిర్యాదు చేశాడని కూడా ఆయన తెలిపారు. దీనితో భీమడోలు పంచాయతీ కోటి రూపాయలకు పైగా జరిగిన అవి నీతి పై విచారణఎదుర్కోవాల్సి ఉందన్నారు.
ఈ లోగా నే పంచాయతీ ఉద్దేశపూర్వకంగా కక్ష బూని దళితుడైన చంద్రమౌళి ఇంటి పై జె సి బి తో ను ట్రాక్టర్ తో వెళ్ళి ఇంటి ప్రహరి పంచాయతీ కచ్చా డ్రైన్ లో కొంత భాగాన్ని ఆక్రమించి నిర్మించాడని పంచాయతీ సిబ్బంది పిర్యాదుదారుడు చంద్రమౌళి కి ఎటువంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటి పునాదులు కదిలిపోయే లాగా ప్రహరి గోడను కూల్చి విధ్వంసం సృష్టించారని అన్నారు. ఈ తీరు ను ఎమ్ ఆర్ పి ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
భీమడోలు పంచాయతీలో కోటి రూపాయలకు పైగా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ ఉద్యోగి పై రాజేశ్వరరావు ఏలూరు జిల్లా ఎస్ పి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ బహిరంగoగా ఆ ఉద్యోగి పాల్పడిన కోట్లాది రూపాయల అవినీతి గుట్టు ను విప్పారు. ఆ ఉద్యోగి విధులు నిర్వహించిన ప్రతి పంచాయతీలో పంచాయతీ నిధులు దోపిడికి పాల్పడడమే ఆ ఉద్యోగికి అలవాటుగా మారిపోయిందన్నారు. అటువంటి ఉద్యోగిని ప్రభుత్వం విధులనుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేశారు.
పంచాయతీలను నకిలీ బిల్లులతో దోపిడీ చేసే ఇటువంటి ఉద్యోగులను డిస్మిస్ చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని జిల్లా అధికారులను కోరారు. ఆ ఉద్యోగి విధులు నిర్వహించిన పంచాయతీలలో నిధుల దోపిడికి పాల్పడుతున్నా జిల్లా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని రాజేశ్వరరావు ప్రశ్నించారు.
ఆ ఉద్యోగి పాల్పడిన దోపిడీలు తాను సరిచేసినట్టు చెప్పారు. ఐనా తనకు ప్రభుత్వం ఇచ్చే వేతనాలు చాలడంలేదేమో గానీ ఆ ఉద్యోగి పంచాయతీల నిధుల దోపిడి యే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులు ఇప్పటికైన ఆ ఉద్యోగి విధులు నిర్వహించిన పంచాయతీలలో జిల్లా అధికారులు నిస్పక్షపాతంగా విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల ఆర్ధిక దోపిడి బాగోతం వెలుగు చూస్తుందని అన్నారు. జిల్లా అధికారులను కలవడానికి వెళ్లిన వారిలో ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు కందుల రమేష్,కాశి కృష్ణ,కొత్తపల్లి మురళీ, తదితరులు ఉన్నారు.