నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులపై దమనకాండ దళిత ద్రోహి జగన్ రెడ్డి అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎస్సీ సెల్ పార్లమెంటు కో-ఆర్డినేటర్ కాకి ప్రసాదరావు మాట్లాడుతూ దళితులపై హత్యలు అత్యాచారాలు అవమానాలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయని అన్నారు.
రాష్ట్రంలో దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ద్వారా విజయబాబు మాట్లాడుతూ దళితులపై దాడులు జరుగుతుంటే దళిత హోం మంత్రి సుచరిత స్పందించకపోవడం దారుణమన్నారు.
అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాలాభిషేకం చేయడం సిగ్గు చేటు అన్నారు. నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు మాతంగి కృష్ణ మాట్లాడుతూ దళిత సంఘాలు దళిత మేధావులు నాయకులు అందరూ ఒకటై దళితులపై దాడులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లో ఆరవ కిషోర్ ధారా పెంచల రావు ఏంబేటి మైకేల్ తలారి ఆనందరావు మంగళ పూరి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.