27.7 C
Hyderabad
April 20, 2024 00: 27 AM
Slider వరంగల్

లబ్ధిదారులు దళిత బందును సద్వినియోగం చేసుకోవాలి

#mulugumla

ములుగు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దళిత బందు లబ్ధిదారుల అవగాహన సదస్సు జరిగింది. ములుగు కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ఈ సదస్సుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ లబ్ధిదారులు దళిత బందు ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రతి ఒక్కరూ ఎంచుకున్న యూనిట్ ద్వారా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ప్రతి పక్ష ఎమ్మెల్యే అనే భేదం లేకుండా తన నియోజక వర్గానికి 100 మంది లబ్ది దారులను ఎంపిక చేసేందుకు వీలు కల్పించిన ముఖ్య మంత్రి కెసిఆర్ కు, జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ములుగు నియోజక వర్గానికి ఇంకా 2000 వేల మంది దళితులకు దళిత బందు ఇవ్వాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు.

Related posts

కిసాన్ సర్కార్ కాదు.. కసాయి సర్కార్

Satyam NEWS

గుంతలతో అత్యంత ప్రమాద కరంగా 6వ నెంబర్ చౌరస్తా

Satyam NEWS

వైసీపీ అసమర్థతే పోలవరం ప్రాజెక్టుకు శాపం

Satyam NEWS

Leave a Comment