39.2 C
Hyderabad
March 28, 2024 14: 49 PM
Slider హైదరాబాద్

దళిత బంధు రాష్ట్రం మొత్తం వెంటనే అమలు చేయాలి

#amberpet

దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్ పేట ఎంఆర్ఓ కార్యాలయం ముందు రిలే నిరాహారదీక్ష దీక్ష చేశారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దీక్షను కొనసాగిస్తున్న అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి బడుగుల బాలకృష్ణ మాదిగ శనివారం ఈ కార్యక్రమానికి బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి ఏడెల్లి అజయ్, రవీందర్ గౌడ్, చారి, కనకయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే దళిత బంధు అములు చేశాడని ఆరోపించారు. సిఎం కేసీఆర్ ప్రజలను మభ్య పెట్టి మోసం చేస్తున్నాడని ఆయన మాటకారిని చేతకాని దద్దమ్మ అన్ని విమర్శంచారు. దళిత బంధు ప్రతి ఒక్కరికి ఎన్నికలకు ముందే  అందరికి ఇవ్వాలని కోరారు. ఈ  కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరెంటి విజయ్ మాదిగ, పల్లె రాజు, సంపత్, దైదా సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగలేదు

Satyam NEWS

ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిగ్ బాస్ ప్రోమో

Satyam NEWS

మొక్కలు నాటిన యాంకర్‌ అనుసూయ

Satyam NEWS

Leave a Comment