36.2 C
Hyderabad
April 23, 2024 19: 04 PM
Slider హైదరాబాద్

40 మంది దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాల అందజేత

#dalitbandhu

బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.  మంగళవారం హబ్సిగూడ లోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 40 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ఉప్పల్ తాసిల్దార్ గౌతమ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు.ఆనాటి సమాజంలో చదువులకు దూరమై దుర్భర జీవితం గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం జీవితాంతం శ్రమించిన సంస్కరణల యోధుడు బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తుచేశారు.

ఈకార్యక్రమంలో మీర్పేట్ హౌసింగ్ బోర్డ్,మల్లాపూర్, నాచారం, చిల్కానగర్ కార్పొరేటర్ లు  ప్రభుదాస్,  పన్నాల దేవేందర్ రెడ్డి,  శాంతి సాయి జెన్ శేఖర్,  బన్నాల గీత ప్రవీణ్, నియోజకవర్గ తెరాస నాయకులు,కార్యకర్తలు దళిత బంధు లబ్ధిదారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

వదల బొమ్మాళీ జేసీ బ్రదర్స్ ను వదల

Satyam NEWS

నిర్లక్ష్యంగా తూనికలు కొలతల అధికారుల పనితీరు

Satyam NEWS

టాంజానియాలో కూలిపోయిన విమానం

Satyam NEWS

Leave a Comment