36.2 C
Hyderabad
April 24, 2024 21: 03 PM
Slider మెదక్

దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలు

#dalitbandhu

సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశల వారీగా దళిత బంధు అందిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత్ జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.

కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు బుధ పూర్ణిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న, స్థానిక జర్నలిస్టులు జంగం రాజలింగం, జనార్దన్, బబ్బూరి రాజు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వృత్తి ధర్మం, సామాజిక న్యాయం చేసేందుకు కలిగి ఉండాల్సిన బాధ్యత ప్రతీ దళిత జర్నలిస్ట్ పై ఉన్నదని తెలిపారు.  

వృత్తితో పాటు సామాజిక బాధ్యత కలిగిన వారు జర్నలిస్టు. తెలంగాణ వచ్చాక ఎస్సీ గురుకుల పాఠశాలలు రెట్టింపు చేసుకున్నాం. ఇంకా అందులో సీట్లు మిగిలిపోతున్నాయని, జర్నలిస్టులు అవసరం ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పించి వారికి అవకాశాలు కల్పించేలా చొరవ చూపాలి. దళిత ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు సబ్సిడీల పై అవగాహన కల్పించి వారికి చైతన్యం కలిగించాలి. వెనుకబడిన వర్గాలను ముందుకు నడిపించే బాధ్యత ప్రతీ జర్నలిస్టులకు ఉంది అని మంత్రి హరీష్ రావు అన్నారు.

సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దళిత బంధు అందిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం వల్లే దళిత బంధు సాధ్యమైంది. సమాజంలో ఎక్కువ శాతం పేదవాళ్లు ఉన్న వర్గం వెనుకబడిన వర్గం దళితులు కాబట్టి వారిని సమాజంలో ముందుకు నడిపించి తద్వారా వారిని దేశానికి ఉపయోగపడే సంపదగా తీర్చిదిద్దాలని ముఖ్య లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు అని హరీష్ రావు అన్నారు.

Related posts

వెంకటాపూర్ లో 20 మందికి బిసి బందు చెక్కుల పంపిణీ

Satyam NEWS

టీడీపీ బలపర్చిన  డా.చిరంజీవిరావును గెలిపిద్దాం..!

Satyam NEWS

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రాణాలతో పోలీసు ఆట

Satyam NEWS

Leave a Comment