రాజ్యాంగ గర్జన వాల్ పోస్టర్, కరపత్రాన్ని హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేడు తెలంగాణ దళిత దండు విడుదల చేసింది. తెలంగాణ దళిత దండు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి కుమార్, మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కేశవులు, మాదిగ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సావిత్రి బాయ్ పూలే సేవా సమితి సుమలత తెలంగాణ దళిత దండు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త నగేష్, మాలల చైతన్య సమితి ప్రెసిడెంట్ మద్దెల రాందాస్, తెలంగాణ దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రమల మొగిలయ్య తదితరులు పాల్గొన్నారు.